Asianet News TeluguAsianet News Telugu

రూపాయి బేల చూపులు.. డాలర్ @ రూ.76.15

వరుసగా  అత్యంత కనిష్ట స్థాయికి దిగజారుతున్న దేశీయ కరెన్సీ  సోమవారం మరో ఆల్ టైం కనిష్టాన్ని నమోదు చేసింది. సోమవారం ట్రేడింగ్‌లో ఏకంగా 95 పైసలు క్షీణించి  76.15 వద్దకు చేరింది. ఇది చారిత్రక కనిష్టం. 

Rupee vs Dollar: Rupee falls to all-time low of 76.15 on coronavirus scare
Author
New Delhi, First Published Mar 23, 2020, 1:01 PM IST

ముంబై: వరుసగా  అత్యంత కనిష్ట స్థాయికి దిగజారుతున్న దేశీయ కరెన్సీ  సోమవారం మరో ఆల్ టైం కనిష్టాన్ని నమోదు చేసింది. సోమవారం ట్రేడింగ్‌లో ఏకంగా 95 పైసలు క్షీణించి  76.15 వద్దకు చేరింది. ఇది చారిత్రక కనిష్టం. 

ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్ మారకంపై రూపాయి పాతాళానికి పడిపోయింది. మరో చారిత్రక రికార్డు నమోదు చేసింది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభం కావడమే బలహీనంగా మొదలైంది. 75.68 వద్ద మొదలైన ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్ తదుపరి 76.08 వద్దకు రూపాయి పడిపోయింది.  

దేశంలో కరోనావైరస్ కేసులు గణనీయంగా పెరగడం, దేశీయ ఈక్విటీలలో భారీ అమ్మకాలు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే రూపాయి విలువ 75.90కి క్షీణించింది.  

శుక్రవారం అమెరికా డాలర్‌తో 75.20 వద్ద స్థిరపడింది. కరోనా వైరస్ (కోవిడ్ -19) మహమ్మారి కారణంగా ప్రపంచ, దేశీయ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో మునిగిపోతున్నందున పెట్టుబడిదారులలో ఆందోళన చెందుతున్నట్లు వ్యాపారులు తెలిపారు. 

దేశంలో మొత్తం కరోనా కేసులు 390 కి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దాదాపు 400 కేసులు నమోదు కావడం ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందన్న ఆంచనాలు వ్యాపించాయని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు.
శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి రూపాయి డాలర్ తో మారకం విలువ 75.20 వద్ద ముగిసింది. దీనికితోడు దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ నిధులు వెనక్కు వెళ్లిపోవడం కూడా రూపాయి విలువ పతనానికి మరో కారణం.శుక్రవారం విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి రూ.3,345.95 కోట్లకు పైగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. 

గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 2.74 శాతం పడిపోయి బ్యారెల్కు 26.24 డాలర్లకు చేరుకుంది. ఆరు కరెన్సీల  గ్రీన్‌బ్యాక్ బలాన్ని అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 0.52 శాతం తగ్గి 102.28 వద్దకు చేరుకుంది. పదేళ్ల ప్రభుత్వ బాండ్ల దిగుబడి 6.31 శాతంగా ఉంది. కాగా దేశీయ స్టాక్  మార్కెట్లలో సెన్సెక్స్ దాదాపు  మూడు వేల పాయింట్లు, నిఫ్టీ 842 పాయింట్లు (10 శాతం లోయర్ సర్క్యూట్ ) పతనం కావడంతో 45 నిమిషాల పాటు ట్రేడింగ్ నిలిపి వేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios