జనవరి 31 నుంచి అంటే నేటి నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు. దీని తరువాత ఆర్థిక మంత్రి ఫిబ్రవరి 1న 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. 

నేడు సాయంత్రం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ఏర్పాట్లను రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పరిశీలించారు. సభ ప్రారంభానికి 48 గంటల ముందు ఎంపీలందరూ ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించుకోవాలని కోరారు. నివేదికల ప్రకారం, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏడు రోజుల హోమ్ క్వారంటైన్ తర్వాత భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎటువంటి పరీక్షలు అవసరం లేదని అధికారులు తెలిపారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అయితే బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31న అంటే నేటి నుండి ప్రారంభంకానున్నాయి. అలాగే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ఈ రోజు ప్రసంగిస్తారు. మరోవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు. దీని తరువాత ఆర్థిక మంత్రి ఫిబ్రవరి 1న 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

సెషన్ సమయంలో ఎలాంటి ఏర్పాట్లు 
కరోనా థర్డ్ వేవ్ దృష్ట్యా మొదటి దశ సెషన్‌లో లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు వేర్వేరు సమయాల్లో నిర్వహించబడతాయి. బడ్జెట్ సెషన్‌లో మొదటి రెండు రోజులు జీరో అవర్ అండ్ క్వశ్చన్ అవర్ ఉండదు.

లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ బుధవారం నుంచి చర్చలు ప్రారంభం అవుతాయి.

 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి దశ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరగనుంది. రెండవ దశ మార్చి 14 నుండి ప్రారంభమై ఏప్రిల్ 8 వరకు కొనసాగుతుంది.

జనవరి 31న ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. రాష్ట్రపతి ప్రసంగం ముగిసిన అరగంట తర్వాత లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. దీని తర్వాత ఆర్థిక మంత్రి 2021-22 ఆర్థిక సర్వేను లోక్‌సభలో సమర్పిస్తారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 

ఫిబ్రవరి 2 నుంచి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్‌సభ కార్యకలాపాలు సాగుతాయి. 

బడ్జెట్ సెషన్ మొదటి భాగంలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, బడ్జెట్‌పై చర్చ ఉంటుంది. ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రభుత్వం తాత్కాలికంగా నాలుగు రోజులను (ఫిబ్రవరి 2, 3, 4 మరియు 7) కేటాయించింది.

బడ్జెట్ సెషన్‌లో మొత్తం 29 సమావేశాలు జరగనుండగా, అందులో మొదటి దశలో 10, రెండో దశలో 19 సమావేశాలు జరగనున్నాయి. సామాజిక దూరాన్ని నిర్ధారించడానికి, లోక్‌సభ ఛాంబర్ (282), లోక్‌సభ గ్యాలరీ (ప్రెస్ గ్యాలరీ మినహా) (148), రాజ్యసభ ఛాంబర్ (60), రాజ్యసభ గ్యాలరీ (51)లలో ఎంపీలకు సీట్లు కేటాయించబడతాయి.

కరోనా బాధిత కుటుంబాలకు ఉపశమన ప్యాకేజీ, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతులకు సంబంధించిన సమస్యలు, సరిహద్దులో చైనాతో ప్రతిష్టంభన ఇంకా మరికొన్ని సమస్యలపై బడ్జెట్ సెషన్‌లో ప్రభుత్వాన్ని చుట్టుముట్టాలని ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ సిద్ధం చేసిన వ్యూహం . సరిహద్దులో చైనా దురాక్రమణ, కొనసాగుతున్న ప్రతిష్టంభన, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక పరిస్థితి, ఎయిర్ ఇండియా, ఇతర ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలు, రైతుల ప్రైవేటీకరణకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని పార్టీలు ఆరోపిస్తున్నాయి.

పెగాసస్ అంశంపై పార్లమెంట్ సభను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ సమాచార సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్‌పై లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ప్రివిలేజ్ మోషన్‌ను కోరారు.