విపణిలోకి టీవీఎస్ కార్గిల్ ఎడిషన్ స్టార్సిటీ ప్లస్
ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ భారత మార్కెట్లోకి సరికొత్త కార్గిల్ ఎడిషన్ పేరిట ‘టీవీఎస్ స్టార్ ప్లస్ సిటీ’ మోడల్ బైక్ను ఆవిష్కరించింది. మార్కెట్లో దీని ధర రూ.54,399గా నిర్ణయించారు.
టీవీఎస్ మోటార్ ఇండియా తన టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ మోడల్లో ‘కార్గిల్ ఎడిషన్’ను ఆవిష్కరించింది. ధర రూ.54,399గా నిర్ణయించింది. ప్రస్తుతానికి ఎంపిక చేసిన డీలర్ల వద్ద ఇది లభ్యం కానుంది.
ప్రతి ఒక్క భారతీయుడిలో ఉండే సైనిక దృక్పథానికి ప్రతీకగా ఈ బైక్ను అందుబాటులోకి తెచ్చినట్లు టీవీఎస్ మోటార్ ఒక ప్రకటనలో తెలిపింది. రాత్రింబవళ్లు ప్రతికూల వాతావరణాలను సైతం తట్టుకుంటూ దేశ రక్షణ కోసం సైనికుల పాటుపడే తీరును ఆదర్శంగా తీసుకొని ఎలాంటి రహదారుల్లోనైనా దూసుకెళ్లేలా కార్గిల్ ఎడిషన్ను తీర్చిదిద్దామని పేర్కొన్నది.
కార్గిల్ ఎడిషన్ నావల్ వైట్, సోల్జర్ గ్రీన్, ప్లైయింగ్ బ్లూ రంగుల్లో లభ్యం కానుంది. ఈ తరహా రంగుల్లో బైకులను తేవడం ఇదే మొదటిసారని టీవీఎస్ మోటార్స్ పేర్కొంది. బైకు వెనకాల కార్గిల్ చిహ్నం కూడా ఉంటుంది.
కార్గిల్ విజరు దివస్ను పురస్కరించుకొని దేశ భద్రతలో తమ జీవితాలను ఫణంగా పెట్టి పోరాడుతున్న సైనికులను గుర్తు చేసుకుంటూ టీవీఎస్ సంస్థ దేశ వ్యాప్తంగా దాదాపు 3500 టచ్ పాయింట్లలో 'కార్గిల్ కాలింగ్-రైడ్ ఫర్ రియల్ స్టార్స్' కార్యక్రమం నిర్వహించింది. ఈ కొత్త వాహనాన్ని 109.7 సీసీ, 8.4 హెచ్పీ ఇంజిన్ సామర్థ్యంతో తయారు చేశారు.