Asianet News TeluguAsianet News Telugu

union Budget 2023: ఇప్పుడు ఫారెన్ కార్లు యమ కాస్ట్లీ.. కేంద్ర బడ్జెట్‌లో లగ్జరీ కార్లపై ఏం ప్రకటించారంటే..?

బడ్జెట్ 2023లో మూడు సెగ్మెంట్ల కార్లు ఖరీదైనవిగా మారాయి. వీటిలో SKD, CBU ఇంకా ఎలక్ట్రిక్ CBU వాహనాలు ఉన్నాయి. బడ్జెట్‌లో ప్రకటన తర్వాత ఈ మూడు సెగ్మెంట్ల కార్లు ఖరీదైనవిగా మారనున్నాయి.
 

Now foreign cars will be more expensive, Finance Minister made this announcement on luxury cars in the budget
Author
First Published Feb 2, 2023, 1:13 PM IST

యూనియన్ బడ్జెట్ 2023 నుండి ఆటోమొబైల్ పరిశ్రమకు ఎలాంటి కేటాయింపు లేదు. అయితే ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలు చౌకగా మారగ, విదేశాల నుంచి లగ్జరీ కార్లను దిగుమతి చేసుకునేందుకు ఖర్చు మరింత పెరిగింది. 2023 బడ్జెట్ తర్వాత విలాసవంతమైన విదేశీ కార్లను కొనడం ఎంత ఖరీదు అవుతుందో తెలుసా...

ఏ కార్ల ఖర్చు పెరిగింది
బడ్జెట్ 2023లో మూడు సెగ్మెంట్ల కార్లు ఖరీదైనవిగా మారాయి. వీటిలో SKD, CBU ఇంకా ఎలక్ట్రిక్ CBU వాహనాలు ఉన్నాయి. బడ్జెట్‌లో ప్రకటన తర్వాత ఈ మూడు సెగ్మెంట్ల కార్లు ఖరీదైనవిగా మారనున్నాయి.

ఎంత ఖరీదు అవుతుంది
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే లగ్జరీ, ఖరీదైన కార్ల ధరలు ఇకపై ఎక్కువే. సెమీ నాక్‌డౌన్‌ సెగ్మెంట్‌లోని ఐసీఈ, ఎలక్ట్రిక్ కార్లపై ఇప్పుడు 35 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొంది. కంప్లీట్ బిల్ట్ యూనిట్ (CBU) రూపంలో విదేశాల నుంచి వచ్చే కార్లపై ఇప్పుడు 70 శాతం సుంకం ఉంటుంది. మూడవ విభాగంలో ఎలక్ట్రిక్ సెగ్మెంట్ కార్లు CBUలుగా వస్తున్నాయి, వాటిని కొనుగోలు చేయడం కూడా ఇప్పుడు ఖరీదైనది.

ప్రభుత్వం పెట్టిన షరతు
ఈ మూడు విభాగాలకు చెందిన విదేశీ వాహనాలను భారత్‌కు తీసుకురావడానికి ప్రభుత్వం సుంకాన్ని పెంచినప్పటికీ దీనికి ప్రభుత్వం కొన్ని షరతులు కూడా పెట్టింది. 3000 సిసి పెట్రోల్ ఇంజన్ అండ్ 2500 సిసి డీజిల్ ఇంజిన్ లేదా US $40 డాలర్ల వేల కంటే ఎక్కువ ఖరీదైన కార్లపై ఇప్పుడు 70 శాతం సుంకం విధించబడుతుంది. అలాగే  40 వేల US డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ధర ఉండే ఎలక్ట్రిక్ CBU కార్లు కూడా 60 శాతానికి బదులుగా 70 శాతం సుంకాన్ని ఆకర్షిస్తాయి.

మూడు విభాగాల్లో  ఉపశమనం
ఇప్పటి వరకు, ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లపై కస్టమ్ డ్యూటీగా SWS అంటే సోషల్ వెల్ఫేర్ సర్‌చార్జిని వసూలు చేసేది. అయితే దీనిని ఇప్పుడు రద్దు చేసింది. ఇంతకుముందు, సికెడి యూనిట్ ఉన్న కార్లపై 30 శాతం సుంకం కాకుండా, 3 శాతం  సోషల్ వెల్ఫేర్ సర్‌చార్జి విధించబడింది, ఇప్పుడు దానిని సున్నాకి తగ్గించారు. ఐసీఈ, ఎలక్ట్రిక్ సీబీయూ కార్లపై 6 శాతం ఎస్‌డబ్ల్యూఎస్‌తో పాటు 60 శాతం డ్యూటీ ఉండగా, ఇప్పుడు దీన్ని కూడా పూర్తిగా తొలగించి 70 శాతానికి తగ్గించారు.

ప్రభుత్వ ప్రయోజనం ఏమిటి
భారతదేశంలోని ఎన్నో వాహన తయారీ కంపెనీ కార్లలో కొన్నింటిని CBU ఇంకా CKD యూనిట్లుగా విక్రయిస్తున్నారు. అయితే ప్రభుత్వం దృష్టి మాత్రం మేక్ ఇన్ ఇండియాపైనే ఉంది. అటువంటి పరిస్థితిలో, విదేశాల నుండి ఈ కార్లను విక్రయించడం ఖరీదైనది అయితే, భవిష్యత్తులో కంపెనీలు ఈ మోడళ్లను భారతదేశంలోనే తయారు చేయాలని నిర్ణయించుకోవచ్చు. దీని వల్ల వాటిపై పన్ను తగ్గుతుంది, అలాగే వాటిని భారతదేశంలో తయారు చేయడం వల్ల భారతీయులకు కూడా ఉపాధి లభిస్తుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios