Asianet News TeluguAsianet News Telugu

విపణిలోకి మహీంద్రా ఎక్స్‌యూవీ ఎఎంటీ.. బట్ రూ.55వేలు అధికం

మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెట్లోకి ఎఎంటీ వర్షన్ ఎక్స్ యూవీ300 కారును తీసుకొచ్చింది. దీని ధర రూ.11.5 లక్షలతో మొదలవుతుంది. ప్రారంభ మోడల్ కారుతో పోలిస్తే దీని ధర రూ.55 వేలు ఎక్కువ.

Mahindra drives in AMT version of XUV300 at Rs 11.5 lakh
Author
New Delhi, First Published Jul 3, 2019, 11:47 AM IST

న్యూఢిల్లీ : ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా గత ఫిబ్రవరిలో విడుదల చేసిన ఎక్స్‌యూవీ 300లో ఆటోమేటెడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ (ఏఎంటీ) వెర్షన్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. న్యూఢిల్లీలో దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.11.5 లక్షలు. 

 

డబ్ల్యూ 8 డీజిల్‌ ఏఎంటీ ట్రిమ్‌, డబ్ల్యూ8 (ఆప్షనల్‌) ట్రిమ్‌ వెర్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ కారుకు అమర్చిన ఎలక్ట్రానిక్‌ వేరియబుల్‌ జియోమెట్రీ టర్బో చార్జర్‌తో కూడిన 1.5 లీటర్‌ టర్బో ఇంజన్‌ 116.6 పీఎస్‌ పవర్‌ విడుదల చేస్తుంది. 

 

ఎఎమ్‌టి టెక్నాలజీ డబ్ల్యూ 8 (డీజిల్)  ఎక్స్‌యూవీ 300 ధరను రూ. 11.5 లక్షలుగా, డబ్ల్యూ 8 (ఆప్షనల్) ట్రిమ్‌ను రూ.12.7 లక్షలుగా ఖరారు చేసింది. ఫిబ్రవరి నాటి ఎక్స్‌యూవీ 300 మోడల్ కారుతో ధరతో పోలిస్తే దీని ధర రూ.55 వేలు అధికం. ఎక్స్ యూవీ 300 డబ్ల్యూ 8 కారు ధర రూ.10.8 లక్షలు కాగా, డబ్ల్యూ8 (ఆప్షనల్) మాన్యువల్ ట్రిమ్ కారు ధర రూ.11.99 లక్షలు.

 

1.5-లీటర్ టర్బో ఇంజిన్‌, ఎలక్ట్రానిక్ వేరియబుల్ జామెట్రీ టర్బోచార్జర్‌,116.6 పీఎస్‌ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ఎక్స్‌యూవీ 300 కారుకి కస్టమర్ల నుంచి మంచి స్పందన వచ్చిందని, ఇప్పుడు ఈ ఆటో వేరియెంట్‌ కూడా అంతే ఆదరణతో బ్రాండ్‌ విలువను మరింతగా పెంచుతుందని ఆశిస్తున్నామని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ సేల్స్‌, మార్కెటింగ్‌ విభాగం చీఫ్‌ విజయ్‌రామ్‌ నక్రా అన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios