తమ్ముడితో అక్రమ సంబంధం..చివరికి ప్రాణాల మీదకి
ఆ విషయాన్ని మరిచి.. శ్రీనివాసులు..యాస్మిన్ తో రెండేళ్ల నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
ఓ మహిళ తనకు తమ్ముడు వరస అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. చివరకు ఆ వివాహేతర సంబంధమే.. ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే...గర శివారులో ఆదర్శనగర్లో రామాంజనేయులు, యాస్మిన్ దంపతులు ఉన్నారు. రామాంజనేయులకి దగ్గరి బంధువు శ్రీనివాసులు కూడా తన భార్య బిడ్డలతో అదే ప్రాంతంలో నివసిస్తున్నాడు. శ్రీనివాసులు యాస్మిన్ కి తమ్ముడి వరస అవుతాడు.
ఆ విషయాన్ని మరిచి.. శ్రీనివాసులు..యాస్మిన్ తో రెండేళ్ల నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. రెండు నెలల కిందట ఈ విషయం ఇరువురి కుటుంబ సభ్యులకు తెలియడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. అప్పటి నుంచి వీరిద్దరూ దూరంగా ఉంటూవచ్చారు. శ్రీనివాసులు గురువారం యాస్మిన్కు ఫోన్చేసి మాట్లాడాలని పిలవడంతో ఆమె అ తడి దగ్గరకు వచ్చింది. అక్కడి నుంచి అనంతపురం రూరల్ మండలం కాట్నేకాలువ చెరువు వద్దకు తీసుకెళ్లాడు.
సంబంధం కొనసాగించాలంటూ కోరడంతో ఇరువురిమధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో శ్రీనివాసులు వెంటతెచ్చుకున్న బ్లేడ్తో ఆమె గొంతుపై కోసి, తలపై రాయితో మోదాడు. అతని నుంచి తప్పించుకుని ఆమె రోడ్డుపైకివచ్చి భర్తకు ఫోన్ద్వారా సమాచారం అందించి పరారై రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
శ్రీనివాసులు కూడా తనకుతానే బ్లేడ్తో మణికట్టును కోసుకుని, విషద్రావకం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి గాయపడిన శ్రీనివాసులు, యాస్మిన్ను వేర్వేరుగా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యచికిత్సలు అందించారు. శ్రీనివాసులు పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.