Asianet News TeluguAsianet News Telugu

ఏపీ శాసనమండలి: అంగుళం భూమి లేదు, చేతులు జోడించి వేడుకొన్న లోకేష్

ఏపీ శాసనమండలిలో బుధవారం నాడు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ చేతులు జోడంచి అమరావతిని చంపొద్దు అంటూ ప్రభుత్వాన్ని వేడుకొన్నారు. 

TDP MLC Nara Lokesh interesting comments on three capitals in legislative council
Author
Amaravathi, First Published Jan 22, 2020, 3:17 PM IST

అమరావతి: ఏపీ రాష్ట్రంలో తన పేరున అంగుళం భూమి కూడ లేదని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ స్పష్టం చేశారు. అమరావతిని చంపొద్దని లోకేష్ చేతులు జోడించి వేడుకొన్నారు. 

Also read:మొబైల్ చూసి నారా లోకేష్ లెక్కలు: తప్పు పట్టిన బొత్స, బుగ్గన అభ్యంతరం

బుధవారం నాడు పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై జరిగిన చర్చలో లోకేష్ మాట్లాడారు. అమరావతిని రాజధానిగా జగన్ స్వాగతించిన విషయాన్ని టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ గుర్తు చేశారు.

Also read:ఏపీ అసెంబ్లీ: టీడీపీ సభ్యుల తీరుపై ఎథిక్స్ కమిటీకి స్పీకర్ సిఫారసు

Also read:బట్టలు విప్పేసి తిరుగుతానంటే ఏం చేయలేం: జేసీ సెటైర్లు

తాము అధికారంలో ఉన్న సమయంలో ప్రతి జిల్లాకు ప్రాధాన్యం ఉండేలా అభివృద్ధిని విస్తరించినట్టుగా లోకేష్ చెప్పారు. రాజధానిగా అమరావతినే శివరామకృష్ణ కమిటీ సూచించినట్టుగా లోకేష్ సభలో ఈ సందర్భంగా ప్రస్తావించారు.

Also read:ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హతకు టీడీపీ నోటీసులు: ఎవరీ పోతుల సునీత

Also read:మండలిలో జగన్‌కు షాక్: ఆ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ నోటీసు

2013లో పుట్టా సుధాకర్ యాదవ్ భూమిని కొనుగోలు చేస్తే అక్రమం ఎలా అవుతుందని లోకేష్ ప్రశ్నించారు. వరదల్లో రాజధాని మునిగిపోతోందని  తప్పుడు ప్రచారం చేస్తున్నారని  లోకేష్ చెప్పారు. 

Also read:రూల్ 71: బుగ్గన ఆ ప్రతిపాదన ఎందుకు చేశారు

Also read:మండలిలో టీడీపీ పట్టు: రూల్ 71 అంటే ఏమిటీ?

వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడ ప్రభుత్వ భూములను విక్రయించారని   లోకేష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అమరావతిలో కట్టిన లేఖను ఏం చేస్తారని లోకేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  190 దేశాల్లో ఒక్క దేశంలోనే మూడు రాజధానులు ఉన్నాయని లోకేష్ చెప్పారు.

also read:ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ: శాసనమండలి రద్దే ఎజెండా?

Also read:మండలిలో వైఎస్ జగన్ కు షాక్: ఏం చేద్దాం, ప్రత్యామ్నాయాలు ఇవీ

20 కోట్ల జనాభా ఉన్న యూపీ రాష్ట్రంలో కూడ ఒకే రాజధాని ఉందన్నారు లోకేష్. అమరావతిని కాపాడాలని  కోరుతూ లోకేష్ అధికార పక్షానికి చెందిన మంత్రులకు దండం పెట్టి వేడుకొన్నారు.అమరావతి ని చంపొద్దు,నరకొద్దు అని చేతులు జోడించి వేడుకున్నారు లోకేష్. 

Also read:మండలి రద్దుకు జగన్ కసరత్తు: అసెంబ్లీలో తీర్మానం?

also read: ఢిల్లీకి పవన్ కళ్యాణ్: బీజేపీ, జనసేన నేతల కీలక భేటీ

Also read:అందుకే టీడీపీ ఒక్క స్థానంలోనే గెలిచింది: అసెంబ్లీలో జగన్

ఐదేళ్ల పసికందు ను చంపేసి తల ఒకచోట, మొండెం ఒక చోట,కాళ్లు మరోచోట పడేయవద్దని కోరారు. జై అమరావతి, జైజై అమరావతి అంటూ నినాదాలు చేశారు. మూడు రాజధానుల విధానానికి తాము పూర్తిగా  వ్యతిరేకమని లోకేష్ తేల్చి చెప్పారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios