అత్యాచారానికి ముందే హత్య... సీతానగరం రేప్ కేసులో మరిన్ని సంచలనాలు: ఎస్పీ ఆరిఫ్ (వీడియో)
గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద కృష్ణా నదీ తీరంలో యువతిపై జరిగిన అత్యాచారం ఘటనపై విచారణలో మరిన్ని సంచలన విషయాలు బయటపడ్డట్లు అర్బన్ ఎస్పీ వెల్లఢించారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో ప్రేమజంటపై దాడిచేసి యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడినిలను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. ఈ సందర్భంగా నిందితులకు సంబంధించిన మరిన్ని నేరాల చిట్టాను అర్బన్ ఎస్పీ అరీఫ్ హఫీజ్ వెల్లడించారు.
ఈ అత్యాచార ఘటనలో నిందితులను అరెస్టు చేయడంకోసం పోలీసులు చాలా కష్టపడ్డాల్సి వచ్చిందన్నారు. జులై 19న ఈ ఘటన జరిగ్గా ఇప్పటివరకు పోలీసులు నిందితుల కోసం గాలిస్తూనే వున్నారన్నారు. చివరకు నిందితుడు కృష్ణ కిషోర్ ని విజయవాడ రైల్వే ట్రాక్ పై పట్టుకున్నామన్నారు. కృష్ణకు సంబంధించి ఆధారాలు దొరకడం ఆలస్యం కావడంవల్లే అరెస్ట్ కూడా ఆలస్యమయ్యిందన్నారు ఎస్పీ.
ఈ అత్యాచార ఘటనలో కృష్ణ కిషోర్ ప్రధాన నిందితుడని తెలిపారు. అలాగే షేక్ హబీబ్ అనే వ్యక్తి కూడా ఈ నేరంలో పాలుపంచుకున్నాడని తెలియజేశారు. ఈ అత్యాచారానికి ముందు వీరు ఒకరిని హత్య చేసినట్లు సంచలన విషయం వెల్లడించారు ఎస్పీ.
వీడియో
''రైల్వే వంతెన పై రాగి తీగలు చోరీ చేస్తుండగా చూశాడని శనక్కాయలు అమ్ముకునే వ్యక్తిని వీరు హత్య చేశారు. అతని మృతదేహాన్ని కృష్ణా నదిలో పడేశారు. పోలీసుల విచారణలో నిందితుడే ఈ విషయాన్ని బయటపెట్టాడు'' అని ఎస్పీ తెలిపారు.
ఇదే సమయంలో కృష్ణాతీరంలో ఉన్న జంటను నిందితులు చూశారని... యువకుడిపై దాడికి పాల్పడి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. గతంలోనే వీరికి నేర చరిత్ర ఉందని... చిల్లర దొంగతనాలు, దాడులు చేసిన నేరాలు వీరిపై ఉన్నాయన్నారు. ఈ కేసులో మరో నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడని... అతడి కోసం గాలిస్తున్నామని ఎస్పీ ఆరిఫ్ వెల్లడించారు.