Asianet News TeluguAsianet News Telugu

ఆర్టీసీ బస్సులో డ్రగ్స్ తరలింపు: విజయవాడలో 40 గ్రాముల ఎండీఎంఏ సీజ్

ఆర్టీసీ బస్సు ద్వారా డ్రగ్స్  సరఫరా చేస్తున్న విషయాన్ని  ఏపీ పోలీసులు గుర్తించారు. బెంగుళూరు నుండి  విజయవాడకు  బస్సులో డ్రగ్స్ తరలిస్తుండగా  పోలీసులు పట్టుకున్నారు.

Police  Seizes  40 MDMA  in Vijayawada  lns
Author
First Published Apr 2, 2023, 10:20 AM IST

విజయవాడ:  ఆర్టీసీ బస్సులో  తరలిస్తున్న  40 గ్రాముల డ్రగ్స్ ను  పోలీసులు  సీజ్  చేశారు.  బెంగుళూరు నుండి  విజయవాడకు  ఈ డ్రగ్స్ ను  తరలిస్తున్నారు. బెంగుళూరు నుండి ఆర్టీసీ బస్సులో  ఈ డ్రగ్స్ సరఫరా చేశారు.  బెంగుళూరు నుండి విజయవాడకు  బయలుదేరిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు బ్యాగు  ఇచ్చారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ బ్యాగును  విజయవాడలో  అందించాలని  చెప్పారు.

 అయితే  ఈ బ్యాగులో  డ్రగ్స్ ఉన్న విషయం తెలియని డ్రైవర్  వైవీ రావు ఆ  బ్యాగును తీసుకున్నాడు.   ఆదివారం నాడు తెల్లవారుజామున  ఈ బస్సు విజయవాడకు  చేరుకుంది. ఈ బస్సు  విజయవాడకు  చేరుకున్న తర్వాత   బస్సు డ్రైవర్ ను  పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. బస్సు డ్రైవర్ వైవీ రావు  వద్ద ఉన్న బ్యాగును స్వాధీనం  చేసుకున్నారు.ఈ బ్యాగులో ఉన్న ప్యాంట్  చుట్టూ   40 గ్రాముల  ఎండీఎంఏ  డ్రగ్స్    ను పోలీసులు  స్వాధీనం  చేసుకున్నారు.  అయితే  ఈ బ్యాగులో  డ్రగ్స్  ఉన్న విషయం తనకు తెలియదని  డ్రైవర్  వైవీరావు  పోలీసులకు చెప్పినట్టుగా సమాచారం

Follow Us:
Download App:
  • android
  • ios