తాడేపల్లి గ్యాంగ్ రేప్ కేసు: అనుమానితుడిపై పలు కేసులు, దర్యాప్తులో కీలక విషయాలు
గుంటూరు జిల్లా తాడేపల్లి గ్యాంగ్ రేప్ ఘటనలో పోలీసులు మరికొన్ని కీలక విషయాలను దర్యాప్తులో గుర్తించారు.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణ, వెంకట్ రెడ్డిల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకట్ రెడ్డిపై గతంలో ఓ హత్య కేుసు నమోదైంది. అంతేకాదు అత్యాచారయత్నం చేసినట్టుగా ఆయనపై ఆరోపణలున్నాయని పోలీసులు గుర్తించారు.
అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లి గ్యాంగ్ రేప్ ఘటనలో పోలీసులు మరికొన్ని కీలక విషయాలను దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణ, వెంకట్ రెడ్డిల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకట్ రెడ్డిపై గతంలో ఓ హత్య కేుసు నమోదైంది. అంతేకాదు అత్యాచారయత్నం చేసినట్టుగా ఆయనపై ఆరోపణలున్నాయని పోలీసులు గుర్తించారు.
also read:గుంటూరు గ్యాంగ్రేప్లో కీలక మలుపు: స్నేహితుడికి కృష్ణ ఫోన్, విచారిస్తున్న పోలీసులు
వెంకట్ రెడ్డి స్నేహితుడు తిరుపతి రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. తాడేపల్లి గ్యాంగ్ రేప్ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంది. నిందితుల కోసం ఆరు పోలీస్ టీమ్ లు గాలింపు చర్యలు చేపట్టారు.గత మాసంలో తనకు కాబోయే భర్తతో తాడేపల్లి మండలంలోని సీతానగరం పుష్కరఘాట్ వద్దకు వెళ్లిన యువతిపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. యువకుడిని కట్టేసి యువతిపై అత్యాచారం చేశారు.ఈ ఘటన జూన్ 19వ తేదీన చోటు చేసుకొంది. ఈ ఘటనలో అనుమానితులను పోలీసులు గుర్తించారు. అయితే పోలీసుల కదలికలను గుర్తించిన అనుమానితులు పారిపోయారు.