8మంది యువతులతో వివాహం.. మోజు తీరాక వ్యభిచార కూపంలోకి..
మోజు తీరిన తర్వాత ఆ అమ్మాయిలను వ్యభిచార కూపంలోకి నెట్టాడు. అలా ఇప్పటి వరకు దాదాపు 8మంది జీవితాలను నాశనం చేశాడు.
అతను ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిది మంది యువతులను పెళ్లి చేసుకున్నాడు. ఒకరికి తెలీకుండా మరొకరి మెడలో తాళి కట్టాడు. గుట్టుగా ఎవరికీ తెలీకుండా సంసారం చేశాడు. అక్కడితో ఆగాడా అంటే.. మోజు తీరిన తర్వాత ఆ అమ్మాయిలను వ్యభిచార కూపంలోకి నెట్టాడు. అలా ఇప్పటి వరకు దాదాపు 8మంది జీవితాలను నాశనం చేశాడు. ఈ సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎనిమిది మంది యువతులను అరుణ్ కుమార్ అనే వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం వారిని వ్యభిచార కూపంలోకి దించాడు. క్రితంలో కూడా అరుణ్ కుమార్ గంజాయి స్మగ్లింగ్లో పలుమార్లు జైలు శిక్షను అనుభవించాడు. మాట వినకపోతే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం చేయలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ మహిళా చేతన అనే స్వచ్ఛంద సంస్థను బాధితులు ఆశ్రయించారు.