నూజివీడు ట్రిపుల్ ఐటీ: అమ్మాయిల హాస్టల్లో యువకుడు, రోజంతా అక్కడే
కృష్ణాజిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో కలకలం రేగింది. విద్యార్ధినుల వసతి గృహంలో ఓ యువకుడు ప్రవేశించి సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డాడు. విద్యార్ధినుల హాస్టల్లోకి ప్రవేశించిన యువకుడు రోజంతా అక్కడే ఉన్నాడు
కృష్ణాజిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో కలకలం రేగింది. విద్యార్ధినుల వసతి గృహంలో ఓ యువకుడు ప్రవేశించి సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డాడు. విద్యార్ధినుల హాస్టల్లోకి ప్రవేశించిన యువకుడు రోజంతా అక్కడే ఉన్నాడు. విషయం తెలుసుకున్న భద్రతా సిబ్బంది ఆ యువకుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
దీనిని తీవ్రంగా పరిగణించిన ట్రిపుల్ ఐటీ యాజమాన్యం.. అతను లేడిస్ హాస్టల్లోకి ప్రవేశించడానికి సాయం చేసిన ఆరుగురు విద్యార్ధినులను సస్పెండ్ చేసింది. అమ్మాయిలు ఉండాల్సిన హాస్టల్లో యువకుడు ఉండటం క్యాంపస్లో కలకలం రేపుతోంది.
Also Read:నా పేరు ఎక్కడా లేదు, ఏ విచారణకైనా సిద్ధం: ఈఎస్ఐ స్కామ్ పై పితాని
ఆ యువకుడు కూడా ట్రిపుల్ ఐటీ క్యాంపస్లోనే చదువుకుంటున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల నుంచి ఐఐఐటీలో ఒక ఫెస్ట్ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి పాల్గొంటున్నారు. ఇదే సమయంలో ఓ విద్యార్ధి పక్కనే ఉన్న లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించినట్లుగా తెలుస్తోంది.
కిటికీ ఊచలను విరగ్గొట్టి అతను గదిలోకి ప్రవేశించినట్లుగా సమాచారం. అతనిని లోపలే ఉంచే ఆ గదికి చెందిన విద్యార్ధినులు బయటకు వెళ్లినట్లుగా ట్రిపుల్ ఐటీ యాజమాన్యం గుర్తించింది.
Also Read:ప్రియురాలి తల్లిపై ఆర్మీ జవాను కాల్పులు.. పెళ్లికొప్పుకోలేదని..
ఈ వ్యవహారంతో ట్రిపుల్ ఐటీలో భద్రతా లోపం మరోసారి వెలుగుచూడటంతో యాజమాన్యం సీరియస్ అయ్యింది. ఇప్పటికే విద్యార్ధుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.