Asianet News TeluguAsianet News Telugu

బీజేపీతో పవన్ పొత్తు.. తొలిసారి స్పందించిన కృష్ణం రాజు

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే పవన్ కళ్యాణ్ తో బీజేపీ కలిసిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ రెండు పార్టీలు జతకట్టడం ఎంతో శుభపరిణామమని అభిప్రాయపడ్డాడు.

Krishnam Raju response on Janasena And Bjp Alliance
Author
Hyderabad, First Published Jan 18, 2020, 4:01 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్... కేంద్రంలోని అధికార పార్టీ అయిన బీజేపీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ పొత్తుపై తాజాగా... కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత, సినీ నటుడు కృష్ణం రాజు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే పవన్ కళ్యాణ్ తో బీజేపీ కలిసిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ రెండు పార్టీలు జతకట్టడం ఎంతో శుభపరిణామమని అభిప్రాయపడ్డాడు.

Also Read బిజెపితో జనసేన పొత్తు... టిడిపి పరిస్థితి ఏంటంటే: మాజీ మంత్రి గంటా వ్యాఖ్యలు...

హైదరాబాద్ ఫిల్మ్ నగర్ క్లబ్ లో జరిగిన తన 80 పుట్టిన రోజు వేడుకల్లో కృష్ణం రాజు ఈ విషయాన్ని ప్రస్తావించారు. సిద్ధాంతాలు కలుపుకొని 5కోట్ల మంది ఆంధ్రులకు సేవ చేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ విస్తరణకు బీజేపీ కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ తోడవడం అన్ని రకాల మేలు చూకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios