Asianet News TeluguAsianet News Telugu

గుంటూరు జిల్లాలో దారుణం: బైక్ మీద వెళ్తుండగా ఆపి భర్తను కొట్టి, భార్యపై గ్యాంగ్ రేప్

ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణమైన సంఘటన జరిగింది. కీచకులు రెచ్చిపోయారు. బైక్ మీద వెళ్తున్న భార్యాభర్తలను అడ్డగించి, భర్తను కొట్టి, భార్యపై దుండగులు సామూహిక అత్యాచారం చేశారు.

Husband thrashed, wife molested in Guntur district
Author
Medikonduru, First Published Sep 9, 2021, 8:42 AM IST

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో కీచకులు రెచ్చిపోయారు. దారుణమైన సంఘటనకు ఒడిగట్టారు. ఓ మహిళపై దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో ఆ సంఘటన చోటు చేసుకుంది.

బైక్ మీద వెళ్తున్న దంపతులను దుండగులు ఆపారు. మహిళ భర్తను తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత కత్తులతో బెదిరించి మహిళను పొలాల్లోకి తీసుకుని వెళ్లి అక్కడ సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటనపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

సత్తెనపల్లి మండలానికి చెందిన భార్యాభర్తులు గుంటూరు నగరంలో ఓ వివాహానికి హాజరై తిరిగి వెళ్తుంమడగా దుండగులు అడ్డగించారు. భర్తపై దాడి చేసి, భార్యపై సమీపంలోని పొలాల్లో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దానిపై బాధితురులు అర్థరాత్రి సత్తెనపల్లి పోలీసు స్టేషన్ కు వెళ్లారు. అయితే, పోలీసులు ఫిర్యాదను తీసుకోవడానికి నిరాకరించారు. 

ఘటన జరిగిన ప్రదేశం గుంటూరు అర్బన్ ఎస్పీ పరిధిలోకి వస్తుందని, తమ పోలీసు స్టేషన్ ఆ పరిధిలోకి రాదని వారు చెప్పారు. దాంతో బాధితులు వెనక్కి మళ్లారు. ఘటన ఎక్కడ జరిగినా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని కేసును సంబంధిత పోలీసు స్టేషన్ కు బదిలీ చేయాలని ఉన్నతాధికారులు గతంలోనే ఆదేశించినప్పటికీ సత్తెనపల్లి పోలీసులు ఫిర్యాదును తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios