Asianet News TeluguAsianet News Telugu

మిత్రుడితో కలిసి బయటకు వెళ్లిన యువతి: ఎస్సై పిలుస్తున్నాడంటూ తీసికెళ్లి రేప్

ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మిత్రుడితో కలిసి బయటకు వెళ్లిన ఓ యువతిని ఆగంతకుడు బెిదిరించి, తన వెంట తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు.

Girl molested in Praksam district of Andhra Pradesh
Author
Ongole, First Published May 29, 2021, 7:05 AM IST

ఒంగోలు: మిత్రుడితో కలిసి బయటకు వెళ్లిన ఓ యువతి అత్యంత విషాదకరమైన పరిస్థితిని ఎదుర్కుంది. మిత్రుడితో కలిసి బయటకు వచ్చిన యువతిని ఓ వ్యక్తి టూ వీలర్ మీద అనుసరించాడు. వారికి సంబంధించిన వీడియోలు తన వద్ద ఉన్నాయని, ఇంట్లో వాళ్లకి చూపుతానని వారిని బెదిరించాడు. 

తానేమీ తప్పు చేయలేదని ఆమె సమాధానం ఇచ్చింది. దాంతో ఆ వ్యక్తి కంగు తిని రూటు మార్చాడు. ఎస్సై పిలుస్తున్నారని, స్టేషన్ కు రావాలని చెప్పాడు. దాంతో ఏం చేయాలో తెలియక ఆమె అతని టూ వీలర్ ఎక్కింది. 

బైక్ మీద ప్రకాశం జిల్లా ఒంగోలు కొత్త మామిడిపాలెం రోడ్డులోకి తీసుకుని వెళ్లి, అక్కడ ఆమెను బెదిరించాడు. ఆమెపై అత్యాచారం చేశాడు. తర్వాత ఆమెను గది వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. ఆ విషయాన్ని తన స్నేహితులకు చెప్పింది. వాళ్లు ధైర్యం చెప్పి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చే విధంగా చేశారు. 

ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో జరిగిన ఈ సంఘటనపై గురువారం రాత్రి దిశ మహిళా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా మరిన్ని నేరాలకు పాల్పడి ఉంటాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios