పాదయాత్రపై తేనేటీగల దాడి.. జగన్ సురక్షితం
పాదయాత్రపై తేనేటీగల దాడి.. జగన్ సురక్షితం
జగన్ పాదయాత్రలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. 183వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఇవాళ ఆయన తన యాత్రను నిడదవోలు నియోజకవర్గంలోని నడిపల్లికోట శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి కానూర్ క్రాస్ రోడ్ వద్దకు చేరుకుంటుండగా.. కొండాలమ్మ తల్లి గుడివద్ద ఒక్కసారిగా తేనేతుట్టె కదలడంతో.. తేనేటీగలు జనం మీదకు వచ్చాయి... దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది జగన్మోహన్ రెడ్డిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.