పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం: మంత్రి వనితకు గాయాలు
ఏపీ మంత్రి వనితకు బుధవారం నాడు రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. మంత్రి వాహనం ఢీకొని ఓ వ్యక్తి మరణించాడు.
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ మంత్రి వనితకు బుధవారం నాడు స్వల్పగాయాలయ్యాయి. మంత్రి కాన్వాయ్లోని వాహనం బైక్ను ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మంత్రికి గాయాలయ్యాయి.
Also read:రాజధాని రచ్చ: పండుగ పూట గుండెపోటుతో ఇద్దరు రైతుల మృతి
సంక్రాంతి పర్వదినం రోజున కుటుంబసభ్యులతో కలిసి మంత్రి వనిత స్వగ్రామ నుండి విజయవాడకు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.
పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులోని మూడు జంక్షన్ వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి మంత్రి వాహనం బైక్ ను ఢీకొని డివైడర్ను ఢీకొంది.
Also read:కరుడుగట్టిన ఉగ్రవాదిలా మారాడు: మందడంలో జగన్పై బాబు ఫైర్
Also Read:జగన్ వెన్నుపోటు పొడిచాడు:అమరావతి రైతుల దీక్షలో వంగవీటి రాధా
ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న వెంకట్రావు అక్కడికక్కడే మృతి చెందారు. మంత్రి కాన్వాయ్లోని వాహనం డివైడర్ను ఢీకొట్టడంతో వాహనంలో ఉన్న మంత్రి వనితకు గాయాలయ్యాయి.