Asianet News TeluguAsianet News Telugu

ఢీల్లీకి తీర్మానం:ఇక ఏపీ శాసనమండలి రద్దు కేంద్రం చేతుల్లోనే

ఏపీ శాసన మండలి రద్దు కోరుతూ ఏపీ అసెంబ్లీలో చేసిన తీర్మానం కాపీ కేంద్రానికి మంగళవారం నాడు చేరింది. 

Ap legislative Council resoultion copy sent to Union government
Author
Amaravathi, First Published Jan 28, 2020, 2:14 PM IST


అమరావతి: ఏపీ శాసనమండలి రద్దు విషయంలో ఏపీ శాసనసభ చేసిన తీర్మానం ప్రతిని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపింది. మంగళవారం నాడు మధ్యాహ్నానికి ఈ తీర్మానం ప్రతి కేంద్రానికి చేరింది.

also read:ఏపీ శాసనమండలి రద్దు తీర్మానంపై ఓటింగ్: ఆ ముగ్గురు ఏం చేశారో తెలుసా?

ఏపీ శాసనమండలి రద్దు చేస్తూ  ఏపీ శాసనసభ ఈ నెల 27వ తేదీన తీర్మానం చేసింది. మండలిని రద్దు కోరుతూ 133 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు చేశారు. ఈ తీర్మానానికి వ్యతిరేకంగా కానీ, తటస్థంగా కానీ ఎవరూ కూడ ఓటు చేయలేదు.

ఏపీ అసెంబ్లీలో జరిగిన అసెంబ్లీ తీర్మానం కాపీని ఏపీ అసెంబ్లీ  కార్యాలయం ఈ నెల  27వ తేదీ రాత్రే రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది.  రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం ఆలస్యం చేయకుండానే  కేంద్రానికి పంపింది.

కేంద్ర హోంశాఖ,  కేంద్ర ఎన్నికల సంఘానికి  ఏపీ ప్రభుత్వం పంపింది. ఈ తీర్మానం కాపీ ఇప్పటికే ఢిల్లీకి చేరింది.. అయితే ఈ తీర్మానంపై  కేంద్ర కేబినెట్ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, ఎన్నికల సంఘానికి పంపనున్నారు.

ఈ తీర్మానంపై ఏం చేయాలనే దానిపై కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. రాజ్యాంగంలోని  ఆర్టికల్ 169 ప్రకారం శాసనమండలిని పునరుద్దరణ లేదా రద్దు చేసే అవకాశం ఉంటుంది.

ఈ ఏడాది పిబ్రవరి 1వ తేదీ నుండి  కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోపుగానే ఈ బిల్లుపై పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదింపచేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.ఇందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం హుటాహుటిన కేంద్రానికి ఈ తీర్మానాన్ని పంపినట్టుగా సమాచారం.
 

Follow Us:
Download App:
  • android
  • ios