పండుగ వాతావరణంలో రైతు భరోసా కార్యక్రమం... (వీడియో)

Oct 15, 2019, 1:36 PM IST

రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో జగ్గయ్యపేటలో రైతు భరోసా కార్యక్రమం జరిగింది. జగ్గయ్యపేటలోని ఆయన నివాసం నుండి వ్యవసాయ మార్కెట్ యార్డుకు ట్రాక్టర్ లతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక  వైఎస్ఆర్ విగ్రహం వద్ద  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చారు. అనంతరం సభ నిర్వహించారు. సభలో మాట్లాడుతూ పెట్టుబడి సాయం కోసం ప్రతి ఒక్క రైతుకు 13,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందజేయనున్నట్లు తెలిపారు.