ఒక పండ్ల వ్యాపారిపై మరో వ్యాపారి కత్తితో దాడి (వీడియో)

Oct 14, 2019, 4:04 PM IST

ఇద్దరు చిరువ్యాపారుల మధ్య డబ్బు లావాదేవీలు దాడికి దారితీశాయి. కృష్ణాజిల్లా గన్నవరం గాంధీ బోమ్మ సెంటర్ వద్ద పండ్ల వ్యాపారి మంద కిషోర్ పై మరో పండ్ల వ్యాపారి పడమట నాగరాజు అరటి పళ్ల కత్తితో దాడి చేశాడు. దీంతో గాయాలపాలైన కిషోర్ గాయాలతోనే పోలీసుస్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు విచారిస్తున్నారు.