సంపన్నులు, కాలేజీ విద్యార్థులే టార్గెట్ (వీడియో)

Oct 12, 2019, 6:12 PM IST

విజయవాడలో డ్రగ్స్ ముఠాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఏడుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి విజయవాడ, గుంటూరు ప్రాంతాల సంపన్న కుటుంబాలకు చెందిన యువతీ యువకులకు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. 

డ్రగ్స్ విక్రయిస్తున్న ఈ ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారినుండి 14 గ్రాముల డ్రగ్స్, రెండున్నర కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో సూడాన్ దేశానికి చెందిన మహమ్మద్ గహేల్ రసూల్, టాంజానీయ దేశానికి చెందిన లీశ్వ షాబాని ఉన్నారు.

అనంత్ కుమార్,శ్రీకాంత్ ఈ ముఠాలో కీలక వ్యక్తులు. బెంగళూరులో 2000 -2500 రూపాయలకు ఈ డ్రగ్స్ కొనుగోలు చేసి 4000 వేల రూపాయలకు విద్యార్థులకు విక్రయిస్తున్నారు. కళాశాల యాజమాన్యం విద్యార్థుల కదలికలపై దృష్టి సారించాలి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలి. డ్రగ్స్ కల్చర్ ని విజయవాడలో అనుమతించం అని విజయవాడ డీసీపీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.