దున్నపోతుతో బండి లాగించి.. సుంకర పద్మశ్రీ వినూత్న నిరసన

Jun 23, 2020, 10:47 AM IST

రోజురోజుకూ పెరిగిపోతన్న పెట్రోల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ విజయవాడలో వినూత్న నిరసన చేపట్టారు. దున్నపోతుకు తాడు కట్టి బండిని లాగించి నిరసన వ్యక్తం చేశారు. పెట్రోల్ ధరలు పెరుగుతున్న కేంద్ర ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడిన చందంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ కేసులకు భయపడి ఈ సమస్యల మీద ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితి అని, టీడీపీ అధినేత చంద్రబాబు మోడీ ప్రాపకం  కోసం కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని అన్నారు.