కృష్ణాజిల్లా: డెంగ్యూతో ఏడో తరగతి విద్యార్ధిని మృతి (వీడియో)

Oct 7, 2019, 4:58 PM IST

కృష్ణాజిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వీరులపాడు మండలం గూడెం మాధవరం గ్రామంలో డెంగ్యూతో విద్యార్ధిని మృతిచెందింది.

గ్రామానికి చెందిన కీర్తన గత కొంత కాలం నుంచి జ్వరంతో బాధ పడుతుండటంతో ఆమె తల్లిదండ్రులు నందిగామలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సనందించారు. అయినప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్‌కు తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ కీర్తన మరణించింది. కూతురి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ చిన్నారి కంచికచర్లలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది.