హైదరాబాద్ అందాలను ప్రతిబింబిస్తూ... సుందరంగా ముస్తాబైన అమరవీరుల స్థూపం

Jan 20, 2023, 12:16 PM IST


హైదరాబాద్ : తమ ప్రాణాలను త్యాగం చేసి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన త్యాగదనుల జ్ఞాపకార్థం కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున అమరవీరుల స్థూపాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. హుస్సేన్ సాగర్ తీరంలో తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ స్థూపం సర్వాంగసుందరంగా ముస్తాబయింది. తుది దశకు చేరుకున్న నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించి నిర్మాణ సంస్థకు, అధికారులకు పలు సూచనలిచ్చారు. తెలంగాణ ప్రజల హృదయాలకు హత్తుకునేలా అమరవీరుల స్థూపం వుంటుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.