Oct 15, 2019, 5:48 PM IST
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఫ్రొ.కోదండరాం కరీంనగర్ లో మద్దతు పలికారు. ఆయన మాట్లాడుతూ నాడు ఆర్టీసీని విలీనం చేస్తానని... నేడు అనలేదు అని అబద్దాలు మాట్లాడడం కెసిఆర్ కే చెల్లిందన్నారు. ఉద్యమం చేస్తున్న కార్మికుల కోసం మద్దతు తెలపడానికి వచ్చిన కరీంనగర్ ఎంపీ ని అరెస్టు చేయడం ఖండిస్తున్నామని చెప్పారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్ధతుగా వారిపై ప్రభుత్వ విధానానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే మంగళవారం PRTU,DTF ఉపాద్యాయ సంఘలు, బిజేపీ పార్టీలు కరీంనగర్ లో నిరసన ర్యాలీలు చేపట్టారు. కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. వెంటనే ఆర్టీసీ కార్మికులను న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.