బీఆర్ఎస్ అనగానే బీజేపీ నాయకులకు భయం పట్టుకుంది.. పౌరసరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్

Dec 10, 2022, 3:06 PM IST

కరీంనగర్ : తెలంగాణ పౌరసరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్ సింగ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. బీఆర్ఎస్ అనగానే బీజేపీ నాయకులకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ కి బీజేపీ నాయకులకు.. సంక్షేమ పథకాల గురించి ప్రశ్నించే నైతిక హక్కు లేదని అన్నారు. బండి సంజయ్ ఒక అజ్ఞాని అని, బండి సంజయ్ ఎన్ని పాదయాత్రలు చేసినా బీజేపీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. రెండు సీట్లు ఉన్న బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాలేదా? బీఆర్ఎస్ కూడా అదే విధంగా దేశంలో ఎదుగుతుంది... అన్నారు. అన్ని రాష్ట్రాలు, పార్టీలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నాయి అన్నారు.