పెద్దపల్లి జిల్లాలో స్కూల్ బస్సు ప్రమాదం...విద్యార్థికి గాయాలు

Aug 19, 2023, 11:48 AM IST

ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి పాఠశాల బస్సు ప్రమాదవశాత్తు చెట్టు కు ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఓ విద్యార్థి కి గాయాలయ్యాయి .పెద్డపల్లి కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఇప్పలపల్లిలోని క్రీసెంట్ పాఠశాల నుండి శుక్రవారం సాయంత్రం విద్యార్థులను స్కూల్ బస్సులో ఇంటికి తరలిస్తుండగా గంగారం గ్రామంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి అదుపుతప్పి చెట్టును ఢీ ఢీకొట్టడంతో పాఠశాల బస్సు ముందు భాగం ధ్వంసం అయింది.బస్సులో ప్రయాణిస్తున్న ఐదో తరగతి చదువుతున్న విద్యార్థి హర్షకు  గాయాలు కాగా పెద్డపల్లి ఆస్పత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న మిగతా విద్యార్థులకు ఏమీ కాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.డ్రైవర్ ఆజాగ్రత్త వల్ల బస్సు నడపడం తో ప్రమాదం జరిగిందని గ్రామస్తులు తెలిపారు.