తెలంగాణ కళాకారుడు, బిఆర్ఎస్ నేత సాయిచంద్ మృతదేహాన్ని చూసి కంటతడి పెట్టిన మంత్రి హరీష్ రావు

Jun 29, 2023, 2:24 PM IST

తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ సాయిచంద్ హఠాన్మరణం బిఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపింది. సాయిచంద్ మృతివార్త తెలిసిన వెంటనే మంత్రి హరీష్ రావు హాస్పిటల్ కు చేరుకున్నారు. మృతదేహాన్ని చూసి భావోద్వేగానికి లోనయిని మంత్రి కంటతడి పెట్టుకున్నారు. సాయిచంద్ మృతదేహానికి నివాళి అర్పించి కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేసారు. సాయిచంద్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవాలని బిఆర్ఎస్ నాయకులకు మంత్రి సూచించారు.