గోదావరిఖని లో లాక్ డౌన్ తీరును పర్యవేక్షించిన రామగుండం పోలీస్ కమిషనర్

May 12, 2021, 4:12 PM IST

ప్రజలు లాక్ డౌన్ ఆంక్షలను అతిక్రమించకుండా సహకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో లాక్ డౌన్ తీరును ఆయన పర్యవేక్షించారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు నాలుగు గంటల సమయం లో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చని ఆ తర్వాత కర్ఫ్యూ నిబంధనలు కఠినంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.