రామగుండము ఎఫ్ఎం రేడియో కేంద్రాన్ని వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ

Apr 28, 2023, 4:10 PM IST

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ టెంపరరీ టౌన్ షిప్ లో ఉన్న ఆకాశవాణి రిలే కేంద్రం ఆధ్వర్యంలో ఎఫ్ఎం రేడియో కేంద్రాన్ని వర్చువల్ పద్ధతిలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఉదయం 10:30 గంటలకు దేశ ప్రధాని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం దేశవ్యాప్తంగా 91 కేంద్రాలను ఆయన ప్రారంభించగా ఇందులో భాగంగా  తెలంగాణ వ్యాప్తంగా నాలుగు ఎఫ్ఎం కేంద్రాలను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. రామగుండం టెంపరరీ టౌన్‌షిప్ లోని రేడియో ఆకాశవాణి రిలే కేంద్రంలో డైరెక్టర్ మణి మంజరి దేవి, జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, బిజెపి శ్రేణులతో పాటు ఆకాశవాణి సిబ్బంది పాల్గొన్నారు.