video: పశువులు వ్యర్థాలతో తయారుచేసిన నూనెతో...

Oct 18, 2019, 12:08 PM IST

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మైలార్ దేవులపల్లిలో దారుణం జరుగుతోంది. అలీనగర్ పీఎస్ పరిధిలో అక్రమంగా పశువుల వ్యర్థాలతో చేసిన నూనెతో సబ్బులు తయారు చేస్తున్న ఓ పరిశ్రమపై ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. కంపెనీ సీజ్ చేసి, ముగ్గురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. సబ్బుల నమూనాలను పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (PCB) అధికారులకు అప్పగించారు.