ఆన్ లైన్ క్లాస్ వింటుండగా లక్షన్నర మాయం

Jun 22, 2021, 5:23 PM IST

మహబూబాబాద్ జిల్లాలో కొడుక్కి ఆన్ లైన్ క్లాసుల కోసం కొనిచ్చిన మొబైల్ ఇప్పుడు ఓ కుటుంబాన్ని తిండి కూడా లేకుండా రోడ్డున పడేసింది. కొడుకు ఆన్ లైన్ క్లాస్ వింటుండగా మధ్యలో వచ్చిన ఏదో లింక్ వొత్తడంతో రైతు వెంకన్న అకౌంట్ లోని లక్షా 50 వేల రూపాయలు మాయం అయ్యాయి.  సంవత్సరం మొత్తం సంపాదించిన డబ్బు పోవడంతో తినడానికి తిండి కూడా లేకుండా ఇబ్బంది పడుతుంది రైతు కుటుంబం.