కరోనా పేషంట్లకు మంత్రి హరీష్ రావు ఫోన్.. వైద్యసహాయం, ఆరోగ్యం గురించి ఆరా..

Jul 17, 2020, 3:58 PM IST

మంత్రి హరీష్ రావు సంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా జిన్నారం మండల కేంద్రంలో కారులో వెళుతూ మధ్యలో ఆగి ఏఎన్‌ఎంల సాయంతో కరోనా రోగుల కుటుంబాలతో మాట్లాడారు. వారి బాగోగులు తెలుసుకొని భరోసా ఇచ్చారు.మీ ఊళ్లో కరోనా కేసులు ఎన్ని ఉన్నాయ్..? హోం ఐసోలేషన్‌లో ఉన్న వారి దగ్గరికి వెళుతున్నారా.. వారికి మందులు ఇస్తున్నారా?’’ అని వైద్య సిబ్బందిని ఆరా తీశారు.