కరీంనగర్ కాంగ్రెస్ లో నయా జోష్... మేళతాళాలు, బైక్ ర్యాలీతో మాణిక్యం ఠాగూర్ కు ఘనస్వాగతం

Aug 29, 2021, 2:27 PM IST

కరీంనగర్: తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మాణిక్యం ఠాగూర్ కరీంనగర్ కు చేరుకున్నారు. జిల్లాలోని తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ కు వద్ద కాంగ్రెస్ శ్రేణులు మాణిక్యం ఠాగూర్ కు ఘన స్వాగతం పలికారు. కరీంనగర్ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్ కు చేరుకున్న ఠాగూర్ కు కాంగ్రెస్ నాయకులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అంతకుముందు భారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు.