ముళ్లకంచెల్లో నిలబడి..వింతప్రవర్తన..కారణమదేనా....

Apr 3, 2020, 3:00 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా,  సిరిసిల్ల బి వై నగర్ కు చెందిన మల్లేశం గత కొంతకాలంగా శాంతినగర్ లో  నివాసముంటున్నాడు. ఈరోజు సిరిసిల్ల బైపాస్ లో ఉన్న ముళ్ళ చెట్ల లో నిలబడి తనకు తాను ఏదో మాట్లాడుకుంటున్నాడు. స్థానికులు ఇది గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు వచ్చి మల్లేశం ను తీసుకుని వెళ్లారు. మల్లేశంకు రోజూ కల్లు తాగే అలవాటుందని అది దొరకక ఇలా అయిపోయాడని అంటున్నారు.  గత కొద్ది రోజులుగా కల్లు బాధితుల చేష్టలు సిరిసిల్ల పట్టణంలో ఎక్కువగా నమోదవుతున్నాయి.