ప్రగతిభవన్ ను ముట్టడించిన జనసేన కార్యకర్తలు(వీడియో)

Apr 25, 2019, 1:20 PM IST

ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలపై జనసేన కార్యకర్తలతో పాటు దాని  అనుబంధ సంస్థ భగత్ సింగ్ స్టూడింట్స్ యూనియన్ కార్యకర్తలు గురువారం ప్రగతి భవన్ ను ముట్టడించారు. వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఆ తర్వాత వారిని గోషామహల్ పీఎస్ కు తరలించారు. నష్టపోయిన విద్యార్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.