బిజెపి నాయకుడిగా మొదటిసారి హుజురాబాద్ కు ఈటల... మంగళహారతులతో ఘనస్వాగతం

Jun 17, 2021, 1:17 PM IST


కరీంనగర్: టీఆర్ఎస్ ను వీడి ఇటీవలే బిజెపిలో చేరిన తర్వాత మొదటిసారి ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గం హుజురాబాద్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి హుజురాబాద్ కు చేరుకున్న ఈటలకు బిజెపి నాయకులు, స్థానిక ప్రజలు భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. ఈ ర్యాలీలో బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు, నాయకులు స్వామి గౌడ్, వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.