బీజేపీలో చేరిన దివంగత కాంగ్రెస్ నేత బాగారెడ్డి తనయుడు జైపాల్ రెడ్డి తో ముఖాముఖి

Aug 13, 2023, 12:00 PM IST

మెదక్ పార్లమెంటు స్థానం నుండి ఇందిరా గాంధీ ని గెలిపించడానికి తన మంత్రి పదవికి రాజీనామా చేసి, శాయశక్తులను ఒడ్డి 2 లక్షల పైచిలుకు మెజారిటీ తో ఇందిర ను గెలిపించిన వ్యక్తి బాగారెడ్డి. నాలుగుసార్లు ఎంపీగా, 6 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ పార్టీ తరుఫున ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ వాది. అలాంటి బాగారెడ్డి తనయుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అనూహ్యంగా ఢిల్లీ వెళ్లి కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆయన రాజకీయ ప్రస్థానం, కాషాయ కండువా కప్పుకోవడానికి కారణం వంటి అనేక అంశాలు ఈ ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో మీకోసం...