KCR Sircilla Visit : గోదావరికి పూజలు చేసిన కేసీఆర్

Dec 30, 2019, 3:28 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. హైదరాబాద్,  మేడ్చల్, మల్కాజిగిరి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల మీదుగా రోడ్డు మార్గంలో కేసీఆర్ మిడ్ మానేరు చేరుకున్నారు. ఉదయం 10:30 సిద్దిపేట సిరిసిల్ల మీదుగా వేములవాడలో రాజన్నను కేసీఆర్ దర్శించుకున్నారు. సిరిసిల్ల బ్రిడ్జి వద్ద మిడ్ మానేరు బ్యాక్ వాటర్ లో పూలు వేసి కేసీఆర్ పూజలు చేశారు.  వేదపండితులు గోదావరికి హారతి నిర్వహించారు.