దారుణం.. సింగరేణి బొగ్గుగనిలో పేలుడు.. నలుగురు కార్మికులు మృతి

Jun 2, 2020, 12:47 PM IST

సింగరేణి ఓపెన్ కాస్ట్ 1లో పేజ్2లోని మహాలక్ష్మి ఓబి బ్లాస్టింగ్ సమయంలో మిస్ ఫైర్ కావడంతో పేలుడు సంభవించి నలుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. మార్పింగ్ షిప్టులో పనిచేస్తున్న నలుగురు కాంట్రాక్ట్ కార్మికులు అక్కడికక్కడే చనిపోగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.