Huzurabad Bypoll:ఆడదాన్ని అర్ధరాత్రి నడిరోడ్డుపై నిలబెట్టాడు... ఇదీ కేసీఆర్: విజయశాంతి సంచలనం

Oct 21, 2021, 5:20 PM IST

కరీంనగర్: కేసీఆర్ ను గద్దె దించే వరకు వదిలిపెట్టబోమని బిజెపి నాయకురాల విజయశాంతి హెచ్చరించారు. కేసీఆర్ కు యముడు బిజెపీయే... ఆయనకు తప్పకుండా గుణపాఠం చెబుతాం అని విజయశాంతి అన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని ఎన్నికల ప్రచారం నిర్వహించిన విజయశాంతి బృందావన్ చౌరస్తాలో మాట్లాడారు.ఉద్యమకారులను కేసిఆర్ అవహేళన చేసి తడిగుడ్డతో గొంతుకోసారని అని అన్నారు. తనను నాతోపాటు టైగర్ నరేంద్ర, ఈటల రాజేందర్ కూడా కేసీఆర్ చేతిలో మోసపోయామన్నారు. తన పార్టీని బలవంతంగా టీఆర్ఎస్ లో విలీనం చేయించాడని... తెలంగాణ ప్రకటనకు ముందు రోజు తనను సస్పెండ్ చేసాడన్నారు. ఇలా ఆడదాన్ని అర్ధరాత్రి నడి రోడ్డు మీద నిలబెట్టిన వ్యక్తి కెసిఆర్ అని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేసారు.