బండి సంజయ్ సంగ్రామ యాత్ర

Aug 28, 2021, 5:33 PM IST

బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తన పాదయాత్రను ప్రారంభించారు. హైదరాబాదులోని పాతబస్తీలో గల భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత ఆయన శనివారం తన పాదయాత్రను ప్రారంభించారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరు మీద ఆయన ఈ యాత్రను సాగిస్తున్నారు. ఆయన పాదయాత్ర నాలుగు విడతల్లో సాగుతుంది. రోజుకు పది కిలోమీటర్లు ఆయన నడక సాగించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, నిరంకుశ పోకడలను ఎండగట్టే ఉద్దేశంతో ఆయన ఈ పాదయాత్రను తలపెట్టారు. బండి సండయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి పెద్ద యెత్తున్న బిజెపి శ్రేణులు కదిలివచ్చాయి.