డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి... సీఎం జగన్ ఘన నివాళి

Dec 6, 2022, 1:30 PM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ లో జరిగిన భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళి అర్పించారు ముఖ్యమంత్రి జగన్. అలాగే మంత్రులు పినిపె విశ్వరూప్, మేరుగ నాగార్జున, ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, నందిగం సురేష్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తదితరులు కూడా బిఆర్ అంబేద్కర్ కు నివాళి అర్పించారు.