మాజీ సైనికుడి నుండి లంచం తీసుకుంటూ... ఏసిబి వలకు చిక్కిన అవినీతి అధికారి

Sep 24, 2022, 1:10 PM IST

కరీంనగర్: ప్రాణాలకు సైతం తెగించి ఇండియన్ ఆర్మీలో చేరి దేశానికి సేవచేసిన మాజీ సైనికుడిని సైతం వదిలిపెట్టలేదు ఆ లంచావతారం అధికారి. ఆర్మీలో రిటైరై తమ స్వస్ధలంలో రేకుల తయారీ ఫ్యాక్టరీ పెట్టుకోడానికి అన్ని అనుమతులూ తీసుకున్నాక కూడా విలేజ్ సెక్రటరీ లక్ష రూపాయలు డిమాండ్ చేసాడు. దీంతో సదరు మాజీ సైనికుడు ఏసిబి ఆశ్రయించడంతో లంచం తీసుకుంటూ సెక్రటరీ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఇలా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట గ్రామ సెక్రటరీ శ్రీధర్ రూ.90 వేలు లంచాన్ని మాజీ ఆర్మీ అధికారి తిరుపతి నుండి తీసుకుంటూ ఏసిబి వలకు చిక్కాడు. రేకుల తయారీ ఫ్యాక్టరీకి ఎన్వోసి ఇవ్వడానికి లక్ష రూపాయల లంచం డిమాండ్ చేసిన సెక్రటరీ చివరకు రూ.90వేలు తీసుకుంటూ పట్టుబడ్డాడు.