వైఎస్ జగన్ తో కిషన్ రెడ్డి భేటీ: ఏ సంకేతాలు ఇస్తాయి?

Aug 27, 2021, 11:14 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి భేటీ కావడం వల్ల బిజెపికో ఏపీలో నష్టం జరుగుతుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఈ భేటీ ముందు అనుకున్నది కాదని, అప్పటికప్పుడు జరిగిందని అంటున్నారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఓ ముఖ్యమంత్రిని కలవడం వల్ల జరిగే నష్టం ఏమీ ఉండదని అంటున్నారు. అదే సమయంలో తెలంగాణలో కిషన్ రెడ్డి పెద్దన్న పాత్ర పోషిస్తున్నారా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. బండి సంజయ్ పాదయాత్ర వాయిదాల వెనక కిషన్ రెడ్డి ఉన్నారా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది.