లండన్‌లో గాంధీకి నివాళులర్పించిన తెలంగాణ స్పీకర్ (వీడియో)

Oct 2, 2019, 5:56 PM IST


జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న స్పీకర్.. బుధవారం లండన్‌ టావోస్టిక్ స్క్వేర్‌ పార్క్‌లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

బ్రిటన్‌లో భారత హైకమీషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండియన్ హైకమీషనర్ శ్రీమతి రుచి ఘనశ్యాం, తెలంగాణ రాష్ట్ర శాసనసభ కార్యదర్శి డా. నరసింహా చార్యులు, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యూనైటెడ్ కింగ్‌డమ్ సభ్యులు పాల్గొన్నారు.