పక్కా రాసిపెట్టుకోండి మళ్లీ మోదీనే

Apr 1, 2024, 10:17 AM IST

త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలు అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి)కే కాదు ప్రతిపక్షాలకు కూడా అగ్నిపరీక్ష. మరీ ముఖ్యంగా ప్రతిపక్షాలకు ఈ ఎన్నికలు పెద్ద సవాల్. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డిఎ) కి   వ్యతిరేకంగా ఇండియా కూటమి పోటీ చేస్తోంది. ఇలా ఎన్నికల హడావిడి సాగుతున్న వేళ  ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ ఆన్ లైన్ సర్వే నిర్వహించింది. ఈ మెగా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ప్రతిపక్ష కూటమి తీవ్రమైన పోటీని ఎదుర్కోనుందని తేలింది. ఈ సార్వత్రిక ఎన్నికలు దేశాన్ని మరింత వృద్దిపథంలో నడిపించగలవని ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తేల్చింది.