టాయిలెట్లకు ఆధునిక హంగులు.. మహిళలకు ప్రత్యేకం.. గంగుల కమలాకర్

Jul 9, 2020, 3:23 PM IST

కరీంనగర్ టౌన్లో ఆరవ విడత హరితహారంలో భాగంగా మంత్రి గంగుల కమలాకర్ మొక్కలు నాటారు. అనంతరం ప్రజల కోసం హైజనిక్ టాయిలెట్స్ కు మంత్రి శంకుస్థాపన చేశారు.  నగరంలో బయటకి వచ్చిన మహిళలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి  ఆ ప్రాంతాలలో నూతనంగా  అధునాతనమైన15 టాయిలెట్స్  నిర్మిస్తున్నామని తెలిపారు. ఇందులో మహిళలకు, చిన్న పిల్లలకు ప్రత్యేకమైన సదుపాయాలు ఉంటాయని అన్నారు.  బయటకు వచ్చిన మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దనే ఉద్దేశంతో, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నామని అన్నారు.