ఆగష్టు తిరుగుబాటు రాణి -అరుణ అసఫ్ అలీ

ఆగష్టు తిరుగుబాటు రాణి -అరుణ అసఫ్ అలీ

Published : Jul 07, 2022, 11:13 AM ISTUpdated : Aug 07, 2022, 08:45 AM IST

భారత స్వాతంత్య్ర ఉద్య‌మ చరిత్రలో మరపురాని రోజు 9 ఆగస్ట్ 1942. 

భారత స్వాతంత్య్ర ఉద్య‌మ చరిత్రలో మరపురాని రోజు 9 ఆగస్ట్ 1942. ఇదే రోజున బొంబాయిలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షతన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగింది. క్విట్ ఇండియా పోరాటానికి ఇక్క‌డే పునాదిరాయి ప‌డింది. అంత‌వ‌ర‌కు శాంతియుతంగా పోరాటం సాగించిన మహాత్మా గాంధీ.. ఆంగ్లేయుల‌పై తిరుగుబాటును ప్ర‌క‌టిస్తూ.. డూ ఆర్ డైకి పిలుపునిచ్చారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టే వరకు విశ్రమించకండి.. పోరాటం సాగించండి అంటూ సాగిన గాంధీ ప్రసంగం తర్వాత.. ఒక 33 ఏళ్ల మహిళ భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ.. బ్రిటిష్ పాల‌కులపై పోరాటానికి  ప్రారంభించి.. భార‌త స్వేచ్ఛ కోసం సాగిన స్వాతంత్య్ర ఉద్య‌మంలో చెర‌గ‌ని ముద్ర‌వేసింది. ఆగస్ట్ విప్లవం రాణిగా పేరుగాంచిన ఆమె ఎవ‌రోకాదు భార‌త వీర వనిత అరుణా అసఫ్ అలీ. 

పంజాబ్‌లోని కల్కాలో ప్రముఖ బ్రహ్మ సమాజి బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అరుణా  కళాశాలలో ఉండగానే స్వాతంత్య్ర ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. తన చిన్నతనం నుండి తిరుగుబాటుదారు, తన కుటుంబం అభ్యంతరాలు ఉన్నప్పటికీ ముస్లిం మతానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు అసఫ్ అలీని వివాహం చేసుకుంది. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు అరుణను అరెస్టు చేశారు. రాజకీయ ఖైదీల హక్కుల కోసం ఆమె తీహార్ జైలులో నిరాహార దీక్ష కూడా చేశారు. రాయల్ ఇండియన్ నేవీలో తిరుగుబాటుకు మద్దతు ఇచ్చిన ఏకైక ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలైన ఆమె వామపక్ష భావజాలానికి వెళ్లారు. ఆమె మొదట కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆ తర్వాత సోషలిస్టు పార్టీలో చేరారు. ఆమె జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా సహచరురాలు.

ఉద్య‌మ‌లో బ్రిటిష్ చ‌ర్య‌ల కార‌ణంగా ఆమె అండర్‌గ్రౌండ్‌కి వెళ్లగా.. అరుణ ఆస్తులను జప్తు చేయ‌డంతో పాటు ఆమెను పట్టుకున్న వారికి 5000 రూపాయల రివార్డు ప్రకటించారు. స్వాతంత్య్రానంతరం అరుణ కమ్యూనిస్టు పార్టీలో చేరారు. ఢిల్లీకి తొలి మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె మహిళల హక్కుల కోసం తన గళాన్ని వినిపించారు. ప్రముఖ పాత్రికేయుడు ఎడతట్ట నారాయణన్‌తో కలిసి ఆమె పేట్రియాట్,  లింక్ వంటి ప్రచురణలను ప్రారంభించారు. అరుణ ప్ర‌ఖ్యాత‌ లెనిన్ ప్రైజ్, నెహ్రూ ప్రైజ్, పద్మవిభూషణ్ అవార్డుల‌ను అందుకున్నారు. మరణానంతరం భారతరత్న అవార్డును అందుకున్నారు. అరుణా అసఫ్ అలీ 1997లో 86వ ఏట తుదిశ్వాస విడిచారు.

05:52 ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంపై మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
00:20 సీపీఆర్ చేసి రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడిన జవాన్
01:20బ్లూ కాలర్ వర్కర్ నుండి మిలియనీర్ గా : నేషనల్ బాండ్స్ డ్రాలో భారత ఎలక్ట్రీషన్ కు వరించిన అదృష్టం
03:35 AP- వ్యవస్థలను జగన్ నాశనం చేశారు- మంత్రి అచ్చెన్నాయుడు
04:00వివేకానందుని సన్నిధిలో ప్రధాని మోదీ ధ్యానం.. అప్పుడు ఉతర భారత్.. ఇప్పుడు దక్షిణ భారత్.. నరేంద్ర మోదీ ప్లాన్ మా
02:46తిరుమలలో అమిత్ షా రాయల్ ఎంట్రీ... సెక్యూరిటీ చూశారా.. షాక్ అవ్వాల్సిందే..
01:35కోతికి సీపీఆర్ చేసి బ్రతికించిన కానిస్టేబుల్.... కామెంట్ల తో హోరెత్తిస్తున్న నెటిజన్లు..
02:08విమానంలో బాంబు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పరుగులు పెట్టిన ప్యాసింజర్.. చివరకు ఏమయ్యిందంటే..?
01:46రాహుల్ గాంధీకి తృటిలో తప్పిన ప్రమాదం... అయినా తగ్గని కాంగ్రెస్ నేత...
02:06మన ఆడియన్స్ ఇంత కఠినంగా ఉంటారు అనుకోలేదు..... మంచు లక్ష్మి మనసులో మాట బయటపెట్టిందిగా...