స్వాతంత్ర మంత్రదండంగా మారిన అతని హాకీ స్టిక్

స్వాతంత్ర మంత్రదండంగా మారిన అతని హాకీ స్టిక్

Published : Jun 17, 2022, 07:09 PM ISTUpdated : Jun 17, 2022, 07:10 PM IST

ఒక దేశం దాని ఆత్మాభిమానాన్ని, ప్రతిఘటనను కేవలం రాజకీయ, సాంస్కృతిక మార్గాల్లోనే కాదు.. సైన్స్, క్రీడల ద్వారా కూడా ప్రకటించవచ్చు. 

ఒక దేశం దాని ఆత్మాభిమానాన్ని, ప్రతిఘటనను కేవలం రాజకీయ, సాంస్కృతిక మార్గాల్లోనే కాదు.. సైన్స్, క్రీడల ద్వారా కూడా ప్రకటించవచ్చు. ఇందుకు ఉదాహరణ ధ్యాన్ చంద్ సారథ్యంలో భారత హాకీ టీం సాధించిన అద్భుత విజయాలను చెప్పుకోవచ్చు. బ్రిటీష్ సామ్రాజ్యవాదులు తాము అన్నింటిలోనూ భారతీయుల కంటే ఉన్నతులమని భావించే వారు. మేధో, కళా, క్రీడా, భౌతిక అధికారం వంటి అన్ని రంగాల్లోనూ తామే అధికులమనే భావనలో ఉండే వారు. భారతీయుల్లోనూ చాలా మంది ఈ ధోరణుల కారణంగా న్యూనతలోనూ ఉండేవారు. బ్రిటన్ సామ్రాజ్యాన్ని ఎదిరించి గెలుపు సాధించడం అసాధ్యమనే ఆలోచనలో కుంగి జాతీయ ఉద్యమం నుంచి వెలుపలికి వెళ్లినవారూ ఉన్నారు.

కానీ, ఇలాంటి సంక్లిష్ట సందర్భంలో భారత హాకీ టీం వరుసగా మూడు సార్లు ఒలింపిక్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని సాధించి భారతీయుల్లో ఆత్మవిశ్వాసాన్ని నూరిపోయడమే కాదు.. యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలోకి నెట్టింది. ఈ అద్భుత విజయం వెనుక భారతీయులు ఎల్లప్పుడూ మననం చేసుకునే అద్భుత క్రీడాకారుడు ధ్యాన్ చంద్ ఉన్నారు. ఆయన ప్రపంచంలోనే మేటి ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ప్రతిభతోనే 1928, 1932, 1936 సంవత్సరాల్లో భారత హాకీ టీం హ్యాట్రిక్ గోల్డ్ సాధించగలిగింది. ఈ విజయ పరంపర 1960ల వరకు కొనసాగింది. హాకీ ప్రపంచంలో భారత ఆధిక్యత ప్రదర్శించింది.

హొలాండ్‌లోని ఆమ్‌స్టర్‌డాంలో 1928 ఒలింపిక్స్‌లో భారత హాకీ టీం గిరిజన తెగకు చెందిన జైపాల్ సింగ్ ముండా సారథ్యంలో బరిలోకి దిగింది. ఆమ్‌స్టర్‌డాం వెళ్లడానికి ముందు టీం లండన్ చేరుకుని అక్కడ ఇంగ్లీష్ ఒలింపిక్ టీమ్‌ను ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో మట్టికరిపించింది. ఇది భారత టీంలో ఎంతో విశ్వాసాన్ని నింపింది. ఒక దాని వెనుక ఒకటి నాలుగు యూరప్ అగ్ర దేశాలను ఒడించిన భారత్ ఆ ఒలింపిక్స్‌ ఫైన్‌లో మార్చి 28న ఆతిథ్య దేశం హొలాండ్ టీమ్‌తో తలపడింది. సుమారు 3 లక్షల మంది డచ్ పౌరులు తిలకిస్తున్న ఆ మ్యాచ్‌లో హొలాండ్ టీంపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ధ్యాన్ చంద్ మెరుపులు కురిపించాడు. ఇండియా స్కోర్ చేసిన మొత్తం 29 గోల్స్‌లో 14 గోల్స్ ఆయనవే. 

05:52 ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంపై మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
00:20 సీపీఆర్ చేసి రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడిన జవాన్
01:20బ్లూ కాలర్ వర్కర్ నుండి మిలియనీర్ గా : నేషనల్ బాండ్స్ డ్రాలో భారత ఎలక్ట్రీషన్ కు వరించిన అదృష్టం
03:35 AP- వ్యవస్థలను జగన్ నాశనం చేశారు- మంత్రి అచ్చెన్నాయుడు
04:00వివేకానందుని సన్నిధిలో ప్రధాని మోదీ ధ్యానం.. అప్పుడు ఉతర భారత్.. ఇప్పుడు దక్షిణ భారత్.. నరేంద్ర మోదీ ప్లాన్ మా
02:46తిరుమలలో అమిత్ షా రాయల్ ఎంట్రీ... సెక్యూరిటీ చూశారా.. షాక్ అవ్వాల్సిందే..
01:35కోతికి సీపీఆర్ చేసి బ్రతికించిన కానిస్టేబుల్.... కామెంట్ల తో హోరెత్తిస్తున్న నెటిజన్లు..
02:08విమానంలో బాంబు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పరుగులు పెట్టిన ప్యాసింజర్.. చివరకు ఏమయ్యిందంటే..?
01:46రాహుల్ గాంధీకి తృటిలో తప్పిన ప్రమాదం... అయినా తగ్గని కాంగ్రెస్ నేత...
02:06మన ఆడియన్స్ ఇంత కఠినంగా ఉంటారు అనుకోలేదు..... మంచు లక్ష్మి మనసులో మాట బయటపెట్టిందిగా...